తెలంగాణ

telangana

కరోనా వార్డులో రోగులకు ఎదురుగా మృతదేహాలు

By

Published : May 8, 2021, 7:30 PM IST

కర్ణాటకలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ.. అమానవీయ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఓ ఆసుపత్రిలోని వార్డులో కరోనా రోగులతో పాటు కొవిడ్​ మృతదేహాలను ఉంచారు. సిబ్బంది నిర్లక్ష్యంతో రోగుల ఇక్కట్లు వర్ణణాతీతంగా మారాయి.

Covid patients are treating with dead bodies
కరోనా రోగులకు ఎదురుగా 'కొవిడ్ మృతదేహాలు'

కరోనా రోగులకు ఎదురుగా 'కొవిడ్ మృతదేహాలు'

కర్ణాటకలోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండ్య జిల్లా.. మాలవళ్లి తాలూకా ఆసుపత్రిలో కరోనా వార్డులోనే.. మహమ్మారితో మరణించిన వారి మృతదేహాలను ఉంచి చికిత్స అందిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. పడకల కొరతతో పాటు.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు వాపోతున్నారు.

కరోనా వార్డులో 'కొవిడ్ మృతదేహాలు'
మృతదేహాలకు ఎదురుగా ఉన్న బెడ్లలో భయంభయంగా రోగులు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు మెరుగుపరచాలని రోగుల బంధువులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details