దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో కరోనా నిబంధనలను పాటించడం లేదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. నిర్లక్ష్యం వహిస్తే మరోసారి కేసులు పెరుగుతాయని హెచ్చరించారు.
"అనేక రాష్ట్రాల్లో ప్రజారవాణా, మార్కెట్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన తీవ్రంగా ఉంది. ఇలా అయితే కరోనా కేసులు విజృంభించే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు."
-కేంద్ర ఆరోగ్య శాఖ