తెలంగాణ

telangana

By

Published : Feb 9, 2022, 9:08 PM IST

ETV Bharat / bharat

కేరళలో భారీగా తగ్గిన కేసులు.. హిమాచల్​లో నైట్​ కర్ఫ్యూ ఎత్తివేత

Covid Cases In India: కేరళలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 23,253 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 854 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. కర్ణాటకలోనూ కేసులు తగ్గుముఖం పట్టాయి. అక్కడ కొత్తగా 5,339 కేసులు నమోదయ్యాయి. 48 మంది మృతిచెందారు.

Covid Cases In India
కేరళలో భారీగా తగ్గిన కేసులు

Covid Cases In India: కేరళలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 23,253 కేసులు నమోదయ్యాయి. మరో 854 మంది కొవిడ్ కారణంగా మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 63,46,631కి చేరింది. మృతుల సంఖ్య 60,793గా ఉంది. మంగళవారం నుంచి మహమ్మారి నుంచి 47,882 మంది కోలుకున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.

దిల్లీలో తాజాగా 1,317 కేసులు నమోదయ్యాయి. మరో 13 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలో పాజిటివిటీ రేటు 2.11గా ఉంది. దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 18,47,515కు చేరింది. వైరస్​తో మృతిచెందిన వారి సంఖ్య 26,023కి చేరింది.

కర్ణాటకలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 5,339 కేసులు నమోదయ్యాయి. 48 మంది మృతిచెందారు.

హిమాచల్ ప్రదేశ్​లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల నైట్​ కర్ఫ్యూను ఎత్తివేసింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

రాష్ట్రం కేసులు మరణాలు
మహారాష్ట్ర 7,142 92
మధ్యప్రదేశ్​ 3,226 05
మిజోరాం 1,806 3
ఒడిశా 1,712 22
రాజస్థాన్ 3,728 17
హిమాచల్​ ప్రదేశ్ 653 1
జమ్ముకశ్మీర్​ 681 4

ABOUT THE AUTHOR

...view details