తెలంగాణ

telangana

మహారాష్ట్రలో కరోనా విలయం.. ఆ రాష్ట్రాల్లో 20వేలకుపైగా కేసులు

By

Published : Jan 11, 2022, 7:19 PM IST

Updated : Jan 11, 2022, 9:39 PM IST

Covid Cases in India: భారత్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దిల్లీలో మరోసారి 20వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, ముంబయిలో కూడా భారీగా కేసులు బయటపడ్డాయి. మరోవైపు మేఘాలయ ప్రభుత్వం ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం​ తప్పనిసరి అని తెలిపింది.

Covid Cases in India:
దేశంలో కరోనా కేసులు

Covid Cases in India: దేశంలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఆందోళనకర స్థాయిలో కొవిడ్​ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కొత్తగా 34,424 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 2,21,477గా ఉంది. ముంబయిలోనే 11,647 కేసులు వెలుగు చూశాయి. మరోవైపు అదే రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 1,281కు చేరింది. 499 మంది ఈ వేరియంట్​ నుంచి కోలుకున్నారు.

  • దిల్లీలో కొత్తగా 21,259 కేసులు బయటపడ్డాయి. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 74,881గా ఉంది. పాజిటివీ రేటు 25.65కు చేరింది.
  • బంగాల్​లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 21,098 మందికి వైరస్​ సోకగా.. 19 మంది మృతిచెందారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 1,02,236కు చేరగా.. పాజిటివిటీ రేటు 32.35 శాతంగా ఉంది.
  • కర్ణాటకలో 14,473 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 73,260గా ఉండగా.. పాజిటివిటీ రేటు 10.30 శాతానికి చేరింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 11,089గా ఉంది. 543 మంది కోలుకోగా.. ఐదు మరణాలు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 44,466కు చేరింది.
  • కేరళలో కూడా కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 9,066 కేసులు వెలుగుచూశాయి. 2,064 మంది కోలుకోగా.. 19 మరణాలు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 44,441గా ఉండగా.. మరణాల సంఖ్య 50,053కు చేరింది.
  • రాజస్థాన్​లో 6,366 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 30,597గా ఉంది.
  • హరియాణాలో 5,746 కొత్త కేసులు వెలుగు చూశాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కొత్తగా 26 ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి.
  • ఝార్ఖండ్​లో కొత్తగా 4,482 మందికి కరోనా పాజిటివ్​ అని నిర్ధరణ అయింది. 1,789 మంది కోలుకోగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రంలో 15-18 ఏళ్ల వారికి టీకాల పంపిణీ విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటివరకు 4.11 లక్షల మంది తొలిడోసు తీసుకున్నారు.

ఆర్టీపీసీఆర్​ తప్పనిసరి

మహమ్మారి ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది మేఘాలయ ప్రభుత్వం. రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఆర్టీపీసీఆర్​ పరీక్ష తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్​ నెగెటివ్​ రిపోర్ట్​ తప్పనిసరి అని.. ఒకవేళ రాష్ట్ర సరిహద్దుల్లోని కేంద్రాల వద్ద పరీక్షలు చేయించుకుంటే ఫలితం వచ్చేవరకు ఐసోలేషన్​లో ఉండాలని తెలిపింది. ఈ ఆంక్షలు వ్యాక్సిన్​ తీసుకున్న వారికి కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.

రూ.50కే ర్యాపిడ్​​ టెస్ట్​

ప్రైవేటు ల్యాబ్​లలో ర్యాపిడ్​ టెస్ట్​ల ధరను నిర్ణయించింది రాజస్థాన్​ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ల్యాబ్​లలో ర్యాపిడ్​ యాంటీజెన్​ టెస్ట్​ చేయించుకోవాలంటే రూ.50 చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ర్యాపిడ్​ టెస్ట్​ ప్రజలు అందరికీ అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఈ ధరలపై ల్యాబ్​ నిర్వహకులు ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

18 లక్షలకు పైగా ప్రికాషన్​ డోసులు

దేశంలో 18 లక్షలకుపైగా ప్రికాషన్​ డోసులు పంపిణీ చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్​లో భాగంగా ఇప్పటివరకు 153.70 కోట్ల డోసులను అందించినట్లు తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 76 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి :ప్రైవేటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్... వారికి నష్టమే!

Last Updated : Jan 11, 2022, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details