తెలంగాణ

telangana

By

Published : Apr 14, 2021, 10:10 AM IST

ETV Bharat / bharat

'వ్యాక్సిన్లు వ్యాధి తీవ్రత, మరణాలను తగ్గిస్తాయి'

కొవిడ్​-19 వ్యాక్సిన్లు తీవ్ర అనారోగ్యం, మరణాల రేటును తగ్గిస్తాయని ఐసీఎం​ఆర్​ డైరెక్టర్​ బలరామ్​ భార్గవ తెలిపారు. టీకా తీసుకున్న అనంతరం వైరస్​ సోకటంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

vaccination
icmr

కొవిడ్​ వ్యాక్సిన్​లు తీవ్ర అనారోగ్యాలు, వైరస్​తో మరణాలు సంభవించే అవకాశాలను తగ్గిస్తాయని ఐసీఎం​ఆర్​ డైరెక్టర్​ బలరామ్ భార్గవ చెప్పారు. టీకా రెండు డోసుల తీసుకున్న తర్వాత కూడా వైరస్​ సోకుతున్న అంశంపై అడిగిన ప్రశ్నపై ఈ మేరకు సమాధానమిచ్చారు.

" ఈ వ్యాక్సిన్​లు వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. రెండు డోసులు తీసుకున్న తర్వాత యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. 85 శాతం వరకు ఆసుపత్రిలో చేరకుండా కాపాడగలవు. వ్యాధితో మరణించటం, తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను తగ్గిస్తాయి. "

-బలరామ్​ భార్గవ, ఐసీఎమ్​ఆర్​ డైరెక్టర్​

దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్​.. రెండు టీకాలను ఉపయోగిస్తున్నారు. స్పుత్నిక్​-వీకి కూడా ఇటీవలే అత్యవసర అనుమతులు లభించాయి.

ఇదీ చదవండి:మాస్క్​ ధరించని ట్రాఫిక్​ పోలీసుకు జరిమానా

:'ప్రాథమిక దశలోనే జోక్యం వద్దు- విచారణ చేయనివ్వండి'

ABOUT THE AUTHOR

...view details