తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాష్ట్రాల సహకార స్ఫూర్తితోనే కరోనా నిర్మూలన'

దేశంలో కరోనా నిర్మూలనకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహకార స్ఫూర్తితో పని చేయాలని పేర్కొన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ. పలు దేశాల్లో కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన.. వైరస్ తీవ్రత ముగిసినట్లు భావించకూడదన్నారు. టీకాల పంపిణీని మరింత వేగవంతం చేయాలని సూచించారు.

By

Published : Nov 11, 2021, 2:41 PM IST

Updated : Nov 12, 2021, 7:06 AM IST

Union Health Minister
కేంద్ర ఆరోగ్య మంత్రి

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. కొవిడ్​ తీవ్రత ముగిసినట్లు భావించకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వైరస్​ నిర్మూలనకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహకార స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. 'హర్​ ఘర్​ దస్తక్​ (ప్రతి ఇంటికీ టీకా)' కార్యక్రమం అమలుపై రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి పనిచేయాలి. కరోనా ముగిసిందని భావించకూడదు. అంతర్జాతీయంగా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి హర్​ ఘర్​ దస్తక్​ కార్యక్రమాన్ని నిశితంగా పర్యవేక్షించాలి. తద్వారా దేశంలో ప్రతి ఇంటికీ టీకాలు అందించాలి. జిల్లాల్లో నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయడానికి కొవిన్​ను ఉపయోగించవచ్చు."

- కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ

అర్హులైన అందరికీ తొలి డోసు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు మాండవీయ. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 79శాతం వయోజనులకు ఒక డోసు, 38శాతం మందికి రెండో డోసు ఇచ్చినట్లు తెలిపారు. రెండో డోసు తీసుకోవాల్సిన వారు 12 కోట్లమంది ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రతి ఇంటి తలుపు తట్టి అర్హులైన అందరికీ కరోనా టీకా అందించాలని కోరారు. అత్యధిక టీకాలు అందించిన జిల్లా, బ్లాక్‌స్థాయి బృందాలకు ర్యాంకింగ్‌ ఇచ్చే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సింగపూర్, బ్రిటన్​, రష్యా, చైనా వంటి దేశాల్లో 80 శాతానికి పైగా టీకాలు వేసినప్పటికీ కేసులు పెరుగుతున్నట్లు గుర్తు చేశారు.

ఇదీ చూడండి:కేరళలో కొత్త వ్యాధి- పిట్టల్లా రాలుతున్న శునకాలు!

Last Updated : Nov 12, 2021, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details