కేరళలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారంతో పోల్చితే కొత్త కేసులు(kerala cases today) భారీగా తగ్గాయి. కొత్తగా 6,664 మందికి వైరస్ నిర్ధరణ అయింది. అయితే.. మరణాలు(Covid-19 deaths) మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే 281 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 49,12,789, మరణాలు 28,873కు చేరాయి.
కేరళలో భారీగా తగ్గిన కరోనా కేసులు- ఆందోళనకరంగానే మరణాలు! - కొత్త కేసులు
కేరళలో కరోనా కొత్త కేసులు(kerala cases today)భారీగా తగ్గాయి. తాజాగా 6,664 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. మరోవైపు.. మరణాల సంఖ్య గణనీయంగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

కేరళలో భారీగా తగ్గిన కొత్త కేసులు
సోమవారం మొత్తం 9,010 మంది వైరస్(Corona virus) నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 74,735కు దిగొచ్చింది. సోమవారం మొత్తం 14 జిల్లాల్లో 61,202 మందికి పరీక్షలు నిర్వహించారు.
- కర్ణాటకలో కొత్తగా 290 పాజిటివ్ కేసులు రాగా.. 10 మంది మరణించారు.
- మిజోరాంలో 158 మంది వైరస్ బారినపడ్డారు. మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
- దేశవ్యాప్తంగా 1.02 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చూడండి:Covid cases in India: దేశంలో మరో 14,306 మందికి కరోనా