తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దాణా స్కామ్​ కేసులో లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష

Lalu Prasad Yadav News: దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్​ యాదవ్​కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధించింది రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.

By

Published : Feb 21, 2022, 2:02 PM IST

Updated : Feb 21, 2022, 3:27 PM IST

Lalu Fodder scam
లాలు ప్రసాద్​ యాదవ్​

Lalu Yadav Fodder scam: దాణా కుంభకోణం కేసులో ఆర్​జేడీ అధినేత, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​కు శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధిస్తున్నట్లు సోమవారం తీర్పు వెలువరించింది.

ఈ కేసులో ఈ నెల 15నే లాలూను దోషిగా తేల్చింది న్యాయస్థానం. అనంతరం ఆయన్ను బిర్సా ముండా సెంట్రల్​ జైలుకు తరలించారు అధికారులు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజేంద్ర ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్ సైన్సెస్​(RIMS)కు తీసుకెళ్లారు.

దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. దోరండా ఖజానా నుంచి రూ.139.35కోట్లు దుర్వినియోగం కేసు ఐదోది, చివరిది. ఈ కేసులో మొత్తం 170 మంది నిందితులు కాగా.. 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వం తరఫున సాక్షులుగా మారారు. ఇద్దరు నేరం అంగీకరించారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. చివరకు లాలూ సహా మొత్తం 99 మంది నిందితులపై ఫిబ్రవరి నుంచి విచారణ జరిపింది రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.

తేజస్వీ యాదవ్ స్పందన..

తన తండ్రికి కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించడంపై తానేమీ మాట్లాడనని తెలిపారు తేజస్వీ యాదవ్. హైకోర్టు, సుప్రీంకోర్టులు ఉన్నాయని చెప్పారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసినట్లు వెల్లడించారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

" దేశంలో దాణా స్కామ్ మినహా మరే ఇతర కుంభకోణం జరగనట్లు భ్రమ కల్పిస్తున్నారు. బిహార్​లో దాదాపు 80 స్కామ్​లు జరిగాయి. వాటి విషయంలో సీబీఐ, ఈడీ, ఎన్​ఐఏ ఏమయ్యాయి? ఈ దేశంలో ఒక్కరే లీడర్​, ఒక్కటే స్కామ్ ఉందా? విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్​ చోక్సీని సీబీఐ మరచిపోయింది. లాలూ భాజపాతో చేతులు కలిపి ఉంటే ఆయన్ను రాజా హరిశ్చంద్ర అనే వారు. కానీ ఆయన అలా చేయకుండా భాజపా-ఆర్​ఎస్​ఎస్​కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అందుకే జైలుకు వెళ్తున్నారు. ఇలాంటి చర్యలతో మేం భయపడే ప్రసక్తే లేదు."

-తేజస్వీ యాదవ్, లాలూ చిన్న కుమారుడు.

Lalu Prasad Yadav News

రూ.950 కోట్ల కుంభకోణం..

అవిభాజ్య బిహార్​కు లాలూ ప్రసాద్​ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.950కోట్ల దాణా కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. 1996 జనవరిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లాలూను నిందితునిగా పేర్కొంటూ 1997 జూన్​లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత సుదీర్ఘ విచారణ జరిగింది. లాలూతోపాటు బిహార్ మాజీ సీఎం జగన్నాథ్​ మిశ్రాపైనా సీబీఐ అభియోగాలు మోపింది.

దుమ్కా, దేవ్​ఘడ్​, ఛాయ్​బసా ఖజానాల నుంచి నిధుల దుర్వినియోగానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. ఆయనకు మొత్తం 14 ఏళ్లు శిక్ష, రూ.60లక్షల జరిమానా పడింది.

2013 సెప్టెంబర్​లో దోషిగా తేలి, తొలిసారి రాంచీ జైలుకు వెళ్లారు లాలూ. 2013 డిసెంబర్​లో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చారు. అయితే.. 2017 డిసెంబర్​లో మరో కేసులో దోషిగా తేలగా.. లాలూ బిర్సా ముండా జైలుకు వెళ్లారు. 2021 ఏప్రిల్​లో ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఇదీ చదవండి:హిజాబ్ వివాదం ఐసిస్ కుట్రే: కర్ణాటక మంత్రి

Last Updated : Feb 21, 2022, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details