తెలంగాణ

telangana

దేశంలో కొత్తగా 14,989 కరోనా కేసులు

By

Published : Mar 3, 2021, 9:47 AM IST

దేశంలో తాజాగా 14,989 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 98 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. 13 వేల మందికి పైగా వైరస్​ను జయించారు.

coronavirus cases and deaths in India latest updates
దేశంలో కొత్తగా 14,989 మందికి కరోనా

భారత్​లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 14,989 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటీ 11 లక్షల 39 వేలు దాటింది. తాజాగా 98 మంది కొవిడ్​తో మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,57,346కు చేరింది.

కొత్తగా 13,123 మంది కొవిడ్​ను జయించారు. ఫలితంగా ఇప్పటివరకు కోటీ 8 లక్షల మందికి పైగా కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 1,70,126 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు పేర్కొంది.

కరోనా కట్టడిలో భాగంగా కొవిడ్ వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,56,20,749 మందికి టీకా అందజేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి:ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. గేటు ఎదుటే ప్రసవం

ABOUT THE AUTHOR

...view details