Corona cases in India: భారత్లో కరోనా కేసులు విపరీతంగా బయటపడుతున్నాయి. కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 34,047 మందికి వైరస్ సోకగా.. 13 మంది మృతి చెందారు. ఒక్క బెంగళూరులోనే 21,071 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ అయింది. ఐదుగురు మరణించారు. నగరంలో ప్రస్తుతం 1,46,200 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. తాజాగా 41,327 కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ ధాటికి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబయిలోనే 7,895 మందికి కొవిడ్ సోకగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరో 8 మందికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది.
దిల్లీలో ఇవాళ 18 వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
దిల్లీలో జైళ్లలోనూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సిబ్బందితో పాటు ఖైదీలకు కరోనా బారిన పడుతున్నారు. కొత్తగా 99 మంది ఖైదీలు.. 88 మంది సిబ్బందికి వైరస్ సోకింది.
రాష్ట్రాలవారీగా కొత్త కేసుల వివరాలు..
ప్రాంతం | కొత్త కేసులు | మరణాలు |
మహారాష్ట్ర | 41,327 | 11 |
కర్ణాటక | 34,047 | 13 |
తమిళనాడు | 23,975 | 22 |
దిల్లీ | 18,286 | 28 |
కేరళ | 18,123 | 08 |
ఉత్తర్ప్రదేశ్ | 17,185 | 10 |
బంగాల్ | 14,938 | 36 |
ఒడిశా | 11,177 | 03 |
గుజరాత్ | 10,150 | 08 |
రాజస్థాన్ | 9,669 | 06 |
హరియాణా | 8,900 | 06 |
మధ్యప్రదేశ్ | 6,380 | 02 |
బిహార్ | 5,410 | 09 |
ఆంధ్రప్రదేశ్ | 4,570 | 01 |
జమ్ముకశ్మీర్ | 3,449 | 06 |
గోవా | 3,232 | 07 |
తెలంగాణ | 2,047 | 03 |
చండీగఢ్ | 1,358 | -- |