తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కలవరం.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్రం ప్రత్యేక సమావేశం.. కొత్త కేసులు ఎన్నంటే?

భారత్​లో కొవిడ్​ కొత్త వేరియంట్ బయటపడడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వివాహ వేడుకలు, రాజకీయ, సామాజిక సమావేశాలు, అంతర్జాతీయ ప్రయాణాలు వంటి బహిరంగ సభలకు దూరంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజలకు సూచించింది. కాగా, గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 163 మందికి కొవిడ్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

By

Published : Dec 23, 2022, 10:31 AM IST

Updated : Dec 23, 2022, 11:41 AM IST

Corona Cases in India
కోవిడ్​ కేసులు

Corona Cases in India: ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు అకస్మాత్తుగా పెరుగుతుండటం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు వివాహ వేడుకలు, రాజకీయ, సామాజిక సమావేశాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, బహిరంగ సభలకు దూరంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ప్రజలకు సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 163 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్​ బారిన పడి ఒకరు మరణించారు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,46,76,678
  • మరణాలు: 5,30,690
  • యాక్టివ్ కేసులు: 3,380
  • రికవరీలు: 4,41,42,608

Vaccination In India: దేశంలో గురువారం 87,723 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,20,02,99,901కు చేరింది. ఒక్కరోజే 1,25,361 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

నాజల్​ వ్యాక్సిన్​కు కేంద్రం అనుమతి
ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్​ను భారత ప్రభుత్వం ఆమోదించింది. ముందుగా ఇవి ప్రైవేట్​ ఆస్పత్రిలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగితే దానికి ముందస్తు సన్నద్ధతగా.. దేశంలోని ఆస్పత్రిల్లో డిసెంబర్​ 27న మాక్​ డ్రిల్​ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. కరోనా పరిస్థితిని ఎదుర్కోవడానికి దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం తెలిపారు.

భారత్​లో బీఎఫ్​-7 వేరియంట్​..
తొలిసారి కొవిడ్‌ బయటపడిన చైనాలో ఆ మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. అయితే, అక్కడ వైరస్‌ విజృంభణ ఒమిక్రాన్ ఉపరకం బీఎఫ్-7 కారణమని నిపుణులు తేల్చారు. ఈ వేరియంట్ భారత్‌లోనూ బయటపడింది. తొలి కేసును గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా బీఎఫ్‌-7 వేరియంట్ కేసులు ఇప్పటివరకు 4 నమోదైనట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అందులో 3 గుజరాత్‌లో నమోదుకాగా.. మరో కేసు ఒడిశాలో వెలుగుచూసినట్లు పేర్కొన్నాయి.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 533,579 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,570 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 660,216,198కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,680,816 మంది మరణించారు. మరో 331,318 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 633,267,647కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 1,84,375 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 339 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియా 75,744 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 62 మంది మృతి చెందారు.
  • ఫ్రాన్స్​లో 49,517 కొత్త కేసులు నమోదవ్వగా.. 120 మంది మరణించారు.
  • అమెరికాలో 43,263 వెలుగుచూడగా.. 289 మంది మృతిచెందారు
  • చైనాలో 3,030 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Last Updated : Dec 23, 2022, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details