తెలంగాణ

telangana

By

Published : Apr 9, 2021, 3:47 PM IST

ETV Bharat / bharat

కేంద్రమంత్రి​ కాన్వాయ్​పై రాళ్ల దాడి

బంగాల్​లో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్​ కాన్వాయ్​పై రాళ్ల దాడి జరిగింది. ఆయన సురక్షితంగా ఉన్నారు. అయితే నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. టీఎంసీ కార్యకర్తలే ఈ దాడి చేశారని షెకావత్​ ఆరోపించారు.

Convoy of Union Minister Gajendra Singh Shekhawat
కేంద్రమంత్రి​ కాన్వాయ్​పై రాళ్ల దాడి

బంగాల్​లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ కాన్వాయ్​పై రాళ్ల దాడి జరిగింది. టీఎంసీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు షెకావత్​ ఆరోపించారు.

పగిలిన కారు అద్దం

నాలుగు వాహనాలు ధ్వంసం

రాష్ట్రంలో నాలుగో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురవారం.. ఓ భాజపా కార్యకర్త ఇంటిని షెకావత్ సందర్శించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్​పై కొందరు దుండగులు రాళ్లు విసిరారు. దీంతో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి.

షెకావత్​ కాన్వాయ్​పై రాళ్ల దాడి
భాజపా కార్యకర్తలతో గజేంద్ర సింగ్​ షెకావత్​

కట్టుదిట్టమైన భద్రతతో బయటకు

ఈ ఘటనపై చెత్లా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి షెకావత్ వెళ్లారు​. అయితే 100-150 మంది టీఎంసీ కార్యకర్తలు పోలీస్​ స్టేషన్​ను చుట్టుముట్టారు. దాదాపు గంటన్నర సమయం పాటు ఆందోళన చేశారు. దీంతో అదనపు బలగాలను మోహరించి అధికారులు.. వారిని చెదరగొట్టారు. తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య మంత్రిని స్టేషన్​ నుంచి బయటకు తీసుకొచ్చారు.

పార్టీ కార్యకర్తలతో కేంద్ర మంత్రి

భాజపా అభ్యర్థిపై దాడి

అంతకుముందు అదే టీఎంసీ కార్యకర్తలు.. భవానీపుర్​లో భాజపా అభ్యర్థి రుద్రనిల్ ఘోష్​పై దాడి చేసినట్లు షెకావత్​ ఆరోపించారు​. ఘోష్​ ఇంటికి వెళ్లి చంపేస్తామని.. కుటుంబ సభ్యులను అత్యాచారం చేస్తామని టీఎంసీ శ్రేణులు బెదిరించాయని చెప్పారు..

షెకావత్​ ఫిర్యాదుతో కాన్వాయ్​పై దాడి ఘటనకు సంబంధించి ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు చెత్లా పోలీసులు.

ఇదీ చూడండి:మమతా బెనర్జీకి మరోసారి ఈసీ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details