ఓ అనూహ్య ఘటనతో ఇద్దరు పోలీసులు వార్తల్లో నిలిచారు. న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరిస్తూ.. ఓ నిందితుడిని జైలు నుంచి విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ జాంజ్గిర్-చంపా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
ఓ అనూహ్య ఘటనతో ఇద్దరు పోలీసులు వార్తల్లో నిలిచారు. న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరిస్తూ.. ఓ నిందితుడిని జైలు నుంచి విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ జాంజ్గిర్-చంపా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
సెక్షన్ 151 కింద ఓ నిందితుడిని నైలా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని న్యాయస్థానం ముందు హాజరుపర్చగా... జైలు శిక్ష విధించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కానీ సునీల్ సింగ్, భూషణ్ రాథోడ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ నిందితుడిని విడిచిపెట్టారు.ఈ విషయాన్ని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి దినేశ్వరి నంద్ తెలిపారు.
ఆ ఇద్దరు పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామన్న దినేశ్వరి నంద్.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'రాజకీయాలకు 'కస్టమ్స్'ను వాడుకుంటున్నారు'