తెలంగాణ

telangana

By

Published : Mar 15, 2021, 10:57 PM IST

ETV Bharat / bharat

'చైనా సరిహద్దులో 59 రహదారుల అనుసంధానం'

చైనాతో సరిహద్దులో రహదారుల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేసింది భారత్. ఇప్పటికే 3,205 కిలోమీటర్ల పొడవైన 59 రోడ్లను అనుసంధానించినట్లు రాజ్యసభ వేదికగా.. ప్రకటించారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్.

Connectivity achieved on 59 roads along border with China: Rajnath Singh
'చైనాతో సరిహద్దుల్లో 59 రోడ్ల అనుసంధానం పూర్తి'

భారత్​-చైనా సరిహద్దులో 3,205 కిలోమీటర్ల పొడవుగల 59 రహదారుల అనుసంధానం పూర్తయినట్లు రాజ్యసభ వేదిగా రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ ప్రకటించారు. 3,323.57 కి.మీల పొడవైన 61 రహదారులు వ్యూహాత్మకంగా కీలకమైనవిగా గుర్తించినట్లు చెప్పారు. వాటి అనుసంధాన ప్రక్రియను సరిహద్దు రోడ్ల నిర్మాణ సంస్థ(బీఆర్​ఓ)కు అప్పగించినట్లు తెలిపారు.

రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు రాజ్​నాథ్​.

61లో మిగిలిన రెండు రహదారుల పొడవు 118.41 కిలోమీటర్లు కాగా.. అనుసంధానించని భాగం 29 కిలోమీటర్లు మాత్రమేనని చెప్పారు. 1530.38 కి.మీల మేర 43 రోడ్లు నిర్మాణం పూర్తయినట్లు వెల్లండిచారు.

తూర్పు లద్దాఖ్​లో భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్టంభన, సరిహద్దుల్లో చైనా ఉద్ధృతంగా చేపడుతోన్న మౌలిక వసతుల ప్రాజెక్టుల నేపథ్యంలో సరిహద్దుల్లో అనుసంధాన ప్రక్రియ పనులను మెరుపు వేగంతో చేపడుతోంది భారత్.

10 ఐసీబీఆర్ రోడ్లను ఈ నెలలో, ఏడింటిని వచ్చే ఏడాది మార్చి నాటికి, మరో రెండింటిని 2023 మార్చి కల్లా పూర్తి చేస్తామని రాజ్​నాథ్ తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేయడానికి అదనపు అధికారాలు, ఆర్థిక వనరులను బీఆర్​ఓ అధికారులకు ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:33% తగ్గిన భారత ఆయుధాల దిగుమతి!

ABOUT THE AUTHOR

...view details