ప్రతి జిల్లాలో 500 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా శిక్షణ ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. నూతన వ్యాపారులకు, అంకురాలకు ఐదేళ్ల పాటు పన్ను మినహాయింపు ఉంటుందని తమిళనాడు కాంగ్రెస్ నేత కేఎస్ అళగిరి అన్నారు.
ఉద్యోగాలే ప్రధానాంశంగా కాంగ్రెస్ మేనిఫెస్టో - చెన్నైలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో.. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యమని పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది కాంగ్రెస్ పార్టీ. మంగళవారం చెన్నై కార్యాలయంలో ప్రజాకర్షక హామీలతో మేనిఫెస్టోని విడుదల చేశారు ఆ పార్టీ నేతలు.
![ఉద్యోగాలే ప్రధానాంశంగా కాంగ్రెస్ మేనిఫెస్టో congress party releases its manifesto ahead of tamilnadu polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11026770-thumbnail-3x2-congress.jpg)
'యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగానే పథకాలు'
చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు తమిళనాడు కాంగ్రెస్ నేతలు.