తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2021, 6:32 PM IST

ETV Bharat / bharat

'ఒంటికాలుతో బంగాల్​లో విజయం-​ రెండు కాళ్లతో దిల్లీపై గురి'

బంగాల్​లో విజయం సాధించిన తర్వాత తమ లక్ష్యం దిల్లీ పీఠంపైనేనని చెప్పారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. బీజాపుర్​ ఎన్​కౌంటర్, కరోనా విజృంభణపై కేంద్రాన్ని తప్పుబట్టారు.

mamatha confident on bengal win
బంగాల్​ విజయం తర్వాత దిల్లీలో విజయం సాధిస్తామన్న మమతా బెనర్జీ

బంగాల్​ ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర​ సీఎం మమతా బెనర్జీ. ఈ విజయం తర్వాత తమ లక్ష్యం దిల్లీపైనేనని చుంచురాలో టీఎంసీ నిర్వహించిన ప్రచార సభలో చెప్పారు. బీజాపుర్​ ఎన్​కౌంటర్, కరోనా విజృంభణ వంటి అంశాలను ప్రస్తావించిన మమత... ఎన్​డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

"కాలికి గాయం అయినా ఒంటికాలుతో బంగాల్​లో విజయం సాధిస్తాం. రెండు కాళ్లతో దిల్లీ పీఠాన్ని అధిష్ఠిస్తాం. బంగాల్​ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి దేశాన్ని భాజపా సరిగా పాలించట్లేదు. అభ్యర్థుల కొరత ఉన్నందునే సిట్టింగ్​ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా దించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నన్ను "దీదీ... ఓ దీదీ" అని హేళనగా పిలిచినా పట్టించుకోను."

--మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం

హూగ్లీ జిల్లాలో సిట్టింగ్​ ఎమ్మెల్యేలు తపన్ దాస్​ ముజుందార్, తపన్​ దాస్ గుప్తా కొన్ని పారపాట్లు చేశారని బహిరంగంగా అంగీకరించారు మమత. వారిని క్షమించి, మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.

ఇదీ చదవండి:నక్సల్స్​ ఎత్తుగడలు తెలిసీ- చిక్కుకుంటున్న బలగాలు

ABOUT THE AUTHOR

...view details