తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'క్యాపిటల్​'లో త్రివర్ణపతాకం- వ్యక్తిపై కేసు - INDIAN FLAG HOIST IN THE US CAPITOL PROTESTS

అగ్రరాజ్యంలోని క్యాపిటల్​ భవనంలో వీరంగం సృష్టించిన ట్రంప్​ మద్దతుదారుల్లో ఒకరిపై దిల్లీలో కేసు నమోదైంది. భారత సంతతికి చెందిన వ్యక్తి నిరసనల్లో జాతీయ జెండాని పట్టుకుని పాల్గొనడమే ఇందుకు కారణం అని పోలీసులు వివరించారు.

COMPLAINT WAS FILED AT THE KALKAJI POLICE STATION AGAINST THE INDIAN FLAG HOIST IN THE US CAPITOL PROTESTS
అమెరికా నిరసనల్లో త్రివర్ణపతాకం-వ్యక్తిపై కేసు నమోదు

By

Published : Jan 9, 2021, 1:59 PM IST

Updated : Jan 9, 2021, 2:07 PM IST

అమెరికా వాషింగ్టన్​​లోని క్యాపిటల్​లో జరిగిన హింసాకాండలో పాల్గొన్న భారత సంతతి వ్యక్తిపై దిల్లీలోని కాలకాజీ పోలీస్టేషన్​లో కేసు నమోదైంది. భారత జాతీయ జెండాని పట్టుకుని హింసాత్మక ఘటనలో పాల్గొనడమే ఇందుకు కారణమని పోలీసులు వివరించారు. ఆందోళనల్లో పాల్గొనే వ్యక్తి త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లడం అనేది జాతీయతకు సంబంధించిన విషయమని తెలిపారు.

అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కనిపించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతని వయసు సుమారు 54ఏళ్లుగా ఉండొచ్చని తెలిపారు.

ఇదీ చూడండి: రణరంగంలా మారిన అమెరికా క్యాపిటల్​ భవనం

Last Updated : Jan 9, 2021, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details