పోలీసు అధికారులు తమ విధులు ఎలా నిర్వర్తిస్తున్నారని పరీక్షించేందుకు ఓ కమిషనర్ మారువేషం ధరించారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
మారు వేషంలో కమిషనర్ కృష్ణ ప్రకాశ్
ఇదీ జరిగింది...
పింప్రి చించ్వడ సిటీలో క్రైమ్ రేట్ ఎక్కువ. ఈ నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో అధికారులు తమ విధులెలా నిర్వర్తిస్తున్నారో తెలుసుకునేందుకు కమిషనర్ కృష్ణ ప్రకాశ్ మారు వేషంలో స్టేషన్కు వెళ్లారు. సల్వార్ కమీజ్, తెల్ల టోపీ ధరించి తన లుక్ని మార్చేశారు. మటన్ దుకాణంలో పనిచేసే వ్యక్తిలా అవతారమెత్తి.. మూడు పోలీసు స్టేషన్లను సందర్శించారు.
తొలుత హింజేవాది పోలీసు స్టేషన్కు వెళ్లిన కమిషనర్ కృష్ణ ప్రకాశ్.. తన భార్యను అత్యాచారం చేసేందుకు కొందరు ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. తర్వాత వకాడ్ ఠాణాకు వెళ్లి.. కొందరు దుండగులు తన ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. చివరగా పింప్రి పోలీసు స్టేషన్కు వెళ్లి.. అంబులెన్స్ డ్రైవర్పై కంప్లైంట్ ఇచ్చారు.
రెండు స్టేషన్లలో పోలీసులు బాగానే స్పందించినప్పటికీ.. ఓ ఠాణాలో చేదు అనుభవం ఎదురైందని కమిషనర్ కృష్ణ ప్రకాశ్ తెలిపారు. సామాన్యుల సమస్యలపై పోలీసులు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకునేందుకే ఇలా మారువేషంలో వెళ్లినట్లు చెప్పారు. ఈ మిషన్లో కమిషనర్తో పాటు అసిస్టెంట్ కమిషనర్ పేర్న కట్టె, ఆయన భార్య కూడా ఉన్నారు.
ఇదీ చదవండి:బోరుబావిలో గున్న ఏనుగు- స్థానికుల సహాయంతో బయటకు