తెలంగాణ

telangana

By

Published : Mar 1, 2021, 12:44 PM IST

Updated : Mar 1, 2021, 12:53 PM IST

ETV Bharat / bharat

కేంద్రం చెప్పుచేతల్లో తమిళ సీఎం: రాహుల్​

తమిళనాడులో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్​నేత రాహుల్​ గాంధీ కన్యాకుమారిలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం చెప్పుచేతల్లో పని చేస్తున్నారని విమర్శలు చేశారు.

Rahul Gandhi on Tamilnadu cm
పళనిస్వామిపై రాహుల్ విమర్శలు

కేంద్రానికి తమిళనాడు సంస్కృతి నచ్చదని కాంగ్రెస్​నేత రాహుల్​ గాంధీ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రం చెప్పుచేతల్లో పని చేసే సీఎం ఉన్నారని విమర్శలు చేశారు. తమిళనాడులో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్యాకుమారిలో నిర్వహించిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్​. భారతీయుడిగా తమిళ సంస్కృతిని కాపాడటం తన బాధ్యత అని వెల్లడించారు.

తమిళనాడు సీఎం పళనిస్వామి రాష్ట్ర అవసరాల కోసం కాకుండా.. మోదీ ఏం చెబితే అది చేస్తున్నారని ఆరోపించారు రాహుల్. మోదీ ముందు తలవంచే వాళ్లు తమిళనాడుకు న్యాయం చేయలేరని పేర్కొన్నారు.

తాటిముంజలు తిన్న రాహుల్​..

నాగర్​కోయిల్​కు వెళ్తూ మార్గ మధ్యంలో రాహుల్​ గాంధీ సహా తమిళనాడు కాంగ్రెస్​ నేతలు తాటి ముంజలు తిన్నారు. అక్కడి వారితో కాసేపు ముచ్చటించారు​.

ఇదీ చదవండి:కాశీలో నడ్డా, గువాహటిలో ప్రియాంక పూజలు

Last Updated : Mar 1, 2021, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details