పంజాబ్ను కరోనా రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం అమరీందర్ సింగ్. 100 శాతం వ్యాక్సినేషన్ సాధించిన గ్రామాలకు రూ.10లక్షల చొప్పున ప్రత్యేక అభివృద్ధి గ్రాంటును మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ప్రకటించింది.
ఇప్పటివరకు దేశంలో 18.44కోట్ల మందికి టీకా వేయగా, వ్యాక్సిన్ల కొరత కారణంగా టీకా పంపిణీ కార్యక్రమం మందగించిందని పలు రాష్ట్రాలు ఫిర్యాదులు చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం పంజాబ్ లో మే18 నాటికి 5,04,586 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 12,086 మంది చనిపోయారు.