తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్- ఓ మావోయిస్టు హతం

By

Published : Apr 11, 2021, 4:49 PM IST

Updated : Apr 11, 2021, 5:51 PM IST

chhattisgarh encounter
ఛత్తీస్​గఢ్ ఎన్​కౌంటర్

16:47 April 11

మృతుడిపై రూ. లక్ష రివార్డు

ఛత్తీస్​గఢ్ దంతెవాడ జిల్లా​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ నక్సల్ హతమైనట్లు పోలీసులు తెలిపారు. మరణించిన నక్సల్​ను.. మావోయిస్టు మిలీషియా కమాండర్‌ వెట్టి హుంగాగా గుర్తించారు పోలీసులు. అతడిపై రూ. లక్ష రివార్డు ఉందని వెల్లడించారు. ఘటనాస్థలిలో పిస్తోల్‌, 2 కిలోల ఐఈడీ, ఓ నాటు తుపాకీ, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.  

జిల్లాలోని కటేకల్యాణ్​ పోలీస్​ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు జిల్లా సాయుధ పోలీసులు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటలకు నక్సల్స్​, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమైనట్లు ఎస్​పీ అభిషేక్​ పల్లవ తెలిపారు.  

ఈ ఎన్​కౌంటర్​లో మరికొందరు మావోయిస్టులు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Last Updated : Apr 11, 2021, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details