తెలంగాణ

telangana

By

Published : Aug 14, 2023, 9:45 PM IST

Updated : Aug 14, 2023, 10:23 PM IST

ETV Bharat / bharat

'హైరిస్క్​'లో ఆండ్రాయిడ్​ యూజర్లు.. కేంద్రం వార్నింగ్​.. అప్డేట్​ చేసుకోకపోతే కష్టమే!

CERT IN Warning To Android Users : ఆండ్రాయిడ్‌లోని కొన్ని వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్​ (సీఈఆర్​టీ-ఇన్)​ వెల్లడించింది. ఇవి అత్యంత తీవ్రమైనవిగా తెలిపింది.

CERT IN Warning To Android Users
CERT IN Warning To Android Users

CERT IN Warning To Android Users : ఆండ్రాయిడ్‌ ఫోన్లను ఉపయోగిస్తున్న వినియోగదారులకు కేంద్ర సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (సీఈఆర్​టీ-ఇన్) కీలక హెచ్చరిక చేసింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌- ఓఎస్​లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలు గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాలను 'అత్యంత తీవ్రమైనవి'గా పేర్కొంది. వీటితో సైబర్‌ నేరగాళ్లు ఫోన్లలో సున్నితమైన సమాచారాన్ని చోరీ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆండ్రాయిడ్‌ 10, 11, 12, 12ఎల్‌, 13 వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సీఈఆర్​టీ-ఇన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్రేమ్‌వర్క్‌, ఆండ్రాయిడ్‌ రన్‌టైమ్‌, సిస్టమ్‌ కాంపోనెంట్‌, గూగుల్‌ ప్లే సిస్టమ్‌ అప్‌డేట్స్‌, కెర్నెల్‌, ఆర్మ్‌ కాంపోనెంట్స్‌, క్వాల్కమ్‌ క్లోజ్డ్‌ సోర్స్‌ కాంపోనెంట్స్‌లో తప్పిదాల కారణంగా ఈ సమస్యలు తలెత్తినట్లు వెల్లడించింది.

ప్రమాదం ఇలా!
పైన చెప్పిన తప్పిదాలను ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు మన మొబైల్‌ ఫోన్లలో పాస్‌వర్డ్‌లు, ఫొటోలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డేటా వంటి తదితర సున్నితమైన సమాచారాన్ని దొంగలించే అవకాశముందని సీఈఆర్​టీ-ఇన్ హెచ్చరికలు జారీ చేసింది. హ్యాకర్లు ఫోన్లపై దాడి చేసినప్పుడు.. మొబైల్‌ను వారి అధీనంలోకి తీసుకుని ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ను జొప్పించడం, డివైజ్‌ను పనికిరాకుండా చేసేందుకు ఈ లోపాలు ఉపయోగపడుతాయని పేర్కొంది.

వినియోగదారులు ఏం చేయాలి..?
ఈ లోపాల నుంచి ఫోన్లను సురక్షితంగా ఉంచుకునేందుకు వినియోగదారులు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సీఈఆర్​టీ-ఇన్ సూచించింది. ఇందుకోసం డివైజ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'సిస్టమ్​' అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత 'సిస్టమ్​ అప్​డేట్స్'పై క్లిక్‌ చేసి.. ఏదైనా అప్‌డేట్‌ ఉంటే దాన్ని సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇచ్చిన సూచనలు పాటిస్తూ దాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలని సీఈఆర్​టీ-ఇన్ తెలిపింది. దీంతో పాటు యూజర్లకు పలు సూచనలు చేసింది.

  • విశ్వసనీయమైన సోర్సుల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
  • ఫోన్‌లో మాల్వేర్‌ ఉందా?లేదా? అని తెలుసుకునేందుకు సెక్యూరిటీ యాప్‌ను వినియోగించాలి.
  • విశ్వసనీయమైన వ్యక్తులు/సంస్థలు పంపిన ఈమెయిళ్లు, అటాచ్‌మెంట్లను మాత్రమే తెరవాలి.
  • బలమైన పాస్‌వర్డ్‌తో పాటు యాప్స్‌లో టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఉపయోగించాలి.

ఆ మెసేజ్​లతో జాగ్రత్త.. క్లిక్​ చేస్తే ఖాతా ఖాళీనే!

గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కీలక హెచ్చరిక!

Last Updated : Aug 14, 2023, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details