తెలంగాణ

telangana

By

Published : Oct 25, 2021, 4:03 PM IST

ETV Bharat / bharat

జికా​ వైరస్​పై కేంద్రం అప్రమత్తం​- యూపీకి ప్రత్యేక బృందం

జికా వైరస్ కేసు(zika virus in india) వెలుగు చూసిన నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​కు ప్రత్యేక నిపుణుల బృందాన్ని కేంద్రం పంపింది. ఈ బృందంలోని సభ్యులు.. వైరస్ కట్టడిలో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులకు సహకరించనున్నారు.

Zika virus
జికా​ వైరస్​

ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌లో తొలి జికా వైరస్​ కేసు(zika virus in india) నమోదైన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. పరిస్థితి చేయి దాటిపోకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. వివిధ విభాగాలకు చెందిన ఉన్నత స్థాయి నిపుణులతో కూడిన బృందాన్ని ఉత్తర్​ప్రదేశ్​కు పంపింది.

ఎంటోమాలజిస్టు, ప్రజారోగ్య నిపుణుడు, గైనకాలిజిస్టు, ఆర్​ఎంఎల్ ఆస్పత్రి వైద్య నిపుణులు, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్ర అధికారులు ఈ బృందంలో ఉంటారని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీరంతా జికా కట్టడిలో ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులకు సహకరిస్తారని చెప్పింది. వైరస్​ పరిస్థితులను పర్యవేక్షిస్తారని పేర్కొంది.

వాయుసేన అధికారికి...

కాన్పుర్​లో వాయుసేనలో పనిచేసే ఓ అధికారికి వైరస్‌ సోకినట్లు(zika virus in india) ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన కాన్పుర్‌లోని వాయుసేన ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. రక్త నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు పంపించగా జికా వైరస్‌ (zika virus in india) సోకినట్లు నిర్ధరణ అయినట్లు అధికారులు వివరించారు. బాధితుడిని కలిసిన మరో 22మందికి కూడా వైరస్‌ లక్షణాలే ఉండటం వల్ల వారి రక్త నమూనాలను కూడా పరీక్షలకు పంపినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?

ABOUT THE AUTHOR

...view details