తెలంగాణ

telangana

By

Published : Jun 21, 2021, 7:14 PM IST

Updated : Jun 21, 2021, 7:53 PM IST

ETV Bharat / bharat

బంగాల్​ మాజీ సీఎస్​పై కేంద్రం కొరడా

బంగాల్​ మాజీ ప్రధాన కార్యదర్శి అలాపన్​ బంధోపాధ్యాయపై క్రమశిక్షణ చర్యలకు పూనుకుంది కేంద్రం. ప్రధాన మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరుకాకపోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది కేంద్రం.

Alapan Bandyopadhyay
బంగాల్​ మాజీ సీఎస్

ప్రధాన మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశానికి బంగాల్​ మాజీ ప్రధాన కార్యదర్శి అలాపన్​ బంధోపాధ్యాయ హాజరు కాకపోవటాన్ని దుష్ర్పవర్తనగా పరిగణిస్తూ.. ఆయనపై కేంద్రం క్రమశిక్షణ చర్యలను ప్రారంభించింది. బంధోపాధ్యాయ ప్రస్తుతం బంగాల్​ సీఎం మమతా బెనర్జీకి సలహాదారుగా పనిచేస్తున్నారు.

కేంద్రం పంపిన నోటీసుకు 30 రోజుల్లోగా అలాపన్​ బంధోపాధ్యాయ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బంధోపాధ్యాయకు పెన్షన్​​, తదితర సౌకర్యాల నిలుపుదలపై హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Jun 21, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details