తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుదుచ్చేరి అసెంబ్లీకి ముగ్గురు నామినేట్​ - పుదుచ్చేరి అసెంబ్లీ

పుదుచ్చేరి శాసనసభకు భాజాపాకు చెందిన ముగ్గురిని కేంద్ర హోం శాఖ నియమించింది. వెంకటేశన్‌ కే, వీపీ రామలింగం, ఆర్‌బీ అశోక్‌బాబులను ఎమ్మెల్యేలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

The Union Home Ministry
కేంద్ర హోం శాఖ

By

Published : May 10, 2021, 11:03 PM IST

పుదుచ్చేరి శాసనసభకు ముగ్గురు ఎమ్మెల్యేలను కేంద్ర హోం శాఖ నామినేట్​ చేసింది. కేంద్ర పాలిత ప్రాంతం చట్టం, 1963 కింద ముగ్గురు ఎమ్మెల్యేలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ముగ్గురు వీరే..

  • వెంకటేశన్‌ కే -- మాజీ డీఎంకే ఎమ్మెల్యే
  • వీపీ రామలింగం-- మాజీ పుదుచ్చేరి స్పీకర్ వీపీ శివకొలుందు సోదరుడు
  • ఆర్‌బీ అశోక్‌బాబు -- న్యాయవాది

పుదుచ్చేరిలో మొత్తం 33 స్థానాలు ఉండగా.. శాసనసభ ఎన్నికలు 30 స్థానాలకు జరిగాయి. ఎన్​డీఏ 16 సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆల్​ ఇండియా నేషనల్​ రీజినల్​ కాంగ్రెస్​ పార్టీ(ఏఐఎన్​ఆర్​సీ) అధినేత ఎన్​ రంగస్వామి ఇటీవల ప్రమాణస్వీకారం చేశారు.

ఇదీ చదవండి :ఇన్​స్టాంట్ డ్రింక్​ బాటిళ్లలో 2.5 కిలోల బంగారం

ABOUT THE AUTHOR

...view details