తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ నాయకత్వంలో కరోనాపై భారత్ పోరు: అమిత్ షా - అమిత్ షా తమిళనాడు పర్యటన

Union Home Minister Amit Shah reached Chennai and will lay the foundation stones of Phase II of Chennai Metro Rail with an outlay of Rs 61,843 crore; Rs 1,620 crore elevated expressway project in Coimbatore; expansion of Chennai Trade Centre (Rs 309 crore); Indian Oil Corporation's petroleum terminal at Vallur (Rs 900 crore); Rs 1,400 crore lube plant; Rs 900 crore terminal at Kamarajar Port; and Rs 406 crore check dam with sluice gates across the Cauvery river in Tamil Nadu's Karur district.

amit
అమిత్ షా

By

Published : Nov 21, 2020, 2:59 PM IST

Updated : Nov 21, 2020, 8:54 PM IST

20:53 November 21

జిల్లా అధ్యక్షులతో అమిత్ షా భేటీ..

తమిళనాడు పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో అమిత్ షా భేటీ అయ్యారు. చెన్నైలో పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.  

18:21 November 21

మోదీ నాయకత్వంలో..  

కరోనాపై పోరులో తమిళనాడు ముందుందని అమిత్ షా ప్రశంసించారు. పళనిస్వామి-పన్నీర్​సెల్వం నేతృత్వంలో వైరస్​ నియంత్రణ సమర్థంగా సాగుతోందన్నారు. దేశమంతా ప్రధాని మోదీ నాయకత్వంలో వైరస్​పై పోరాడుతోందని పేర్కొన్నారు.  

18:15 November 21

జయలలిత హయాంలో అభివృద్ధి..

ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రాల మధ్య పోటీతత్వం పెరిగిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. సుపరిపాలనలో తమిళనాడు మొదటిస్థానాన్ని సాధించడం సంతోషకరమని అన్నారు.  

  • మాజీ సీఎం జయలలిత హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించింది: అమిత్ షా
  • కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను తమిళనాడు ప్రభుత్వం అమలు చేసింది: అమిత్ షా
  • కరోనా రికవరీలో తమిళనాడు చాలా ముందుంది: అమిత్ షా

18:06 November 21

భాజపాతో కలిసి పోటీకి..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయని సీఎం పళనిస్వామి ప్రకటించారు. భాజపా-అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

భాజపాతో తమ పొత్తు కొనసాగుతుందని తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్​సెల్వం స్పష్టం చేశారు. చెన్నై లీలా ప్యాలెస్​లో జరిగిన కార్యక్రమంలో అమిత్​ షా సమక్షంలో ప్రకటించారు. 

17:31 November 21

అభివృద్ధి పనులను ప్రారంభించిన షా..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్రహోమంత్రి అమిత్‌షా రెండు రోజుల పాటు చెన్నైలో పర్యటిస్తున్నారు. లీలా ప్యాలెస్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన అమిత్ షా.. చెన్నై మెట్రో రెండో దశ పనులకు దృశ్యమాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. తిరువళ్లూరు జిల్లాలో 380 కోట్ల రూపాయలతో నిర్మించిన రిజర్వాయర్​ను ప్రారంభించారు.  

చెన్నై శనివారం మధ్యాహ్నం చేరుకున్న అమిత్‌ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరిన హోం మంత్రి కారు దిగి నడుచుకుంటూ వెళ్లి కార్యకర్తలకు అభివాదం చేశారు.  

గోబ్యాక్​ అంటూ..

ఈ క్రమంలో గోబ్యాక్ అమిత్ షా అంటూ ఓ వ్యక్తి ఫ్లకార్డు విసిరాడు. ఫ్లకార్డు అమిత్‌షాకు 50 మీటర్ల దూరంలో పడగా భాజపా కార్యకర్తలకు అతనికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యకర్తలు అతనిని కొట్టడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  

రజనీకాంత్​తో భేటీ!

పర్యటనలో భాగంగా రూ.67 వేల కోట్లతో నిర్మించనున్న పలు ప్రాజెక్టులకు అమిత్‌షా శంకుస్థాపన చేస్తారు. చెన్నై పర్యటనలో అమిత్‌షా ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌., కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  

17:19 November 21

తేర్వాయికండిగై రిజర్వాయర్​ను ప్రజలకు అంకితం చేసిన అమిత్​ షా

చెన్నైలో ఏర్పాటు చేసి కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తేర్వాయికండిగైలో రూ.380 కోట్ల వ్యయంతో నిర్మించిన రిజర్వాయర్​ను ప్రజలకు అంకితం చేశారు.  

దృశ్యమాధ్యమం ద్వారా చెన్నై మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అమిత్ షా.  

17:04 November 21

ఎంజీఆర్, జయలలితకు అమిత్ షా నివాళి..

చెన్నైలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితకు నివాళులు అర్పించారు.  

15:56 November 21

  • అమిత్‌షా చెన్నై పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత
  • అమిత్‌షా కార్యకర్తలతో కలిసి నడిచి వెళ్తుండగా వ్యక్తి హల్‌చల్‌
  • అమిత్‌షా గో బ్యాక్ పేరుతో ఉన్న ప్లకార్డును విసిరిన వ్యక్తి
  • అమిత్‌షాకు 50 మీటర్ల దూరంలో పడిన ప్లకార్డు
  • ఆందోళనకారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
  • కాసేపట్లో చెన్నై మెట్రో రెండోదశ పనులకు శంకుస్థాపన చేయనున్న అమిత్‌షా

14:39 November 21

చెన్నై చేరుకున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నై చేరుకున్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్​సెల్వం.. ఆయనకు ఘన స్వాగతం పలికారు. భాజపా కార్యకర్తలు కూడా చెన్నై విమానాశ్రయానికి తరలివచ్చారు.  

అమిత్​ షా వెళ్లే దారి పొడవున భాజపా, అన్నాడీఎంకే కార్యకర్తలు.. ఆయనకు స్వాగతం పలికారు. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల పొత్తులు, సీట్ల కేటాయింపుపై సీఎం పళనిస్వామి, పన్నీర్​ సెల్వంతో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌, కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

పలు అభివృద్ధి పనుల ప్రారంభం..

తిరువళ్లూర్‌ జిల్లా తేరువాయి కండ్రిగలో రూ.380 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను ప్రజలకు అంకితం చేయనున్నారు. రూ.61,843 కోట్లతో చేపట్టే చెన్నై మెట్రోరైలు రెండో దశ పనులకు అమిత్‌షా చేతులమీదుగా శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కూడా పాల్గొననున్నారు.

ఇదీ చూడండి:తమిళనాడుకు అమిత్ ‌షా.. రజనీకాంత్​తో భేటీ!

Last Updated : Nov 21, 2020, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details