దేశంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. ఈ నెల 21 నుంచి 23 వరకు బ్రిటన్ నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికుడికి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా చేయాలని సూచించారు.
'అనుమానం వస్తే.. పుణెకు పంపాలి'
ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారిని సంస్థాగత నిర్భంధం (ఇన్స్టిట్యూషన్ ఐసోలేషన్)లోకి పంపాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు అగర్వాల్. సాధారణ కొవిడ్ రోగులతో కాకుండా.. ప్రత్యేకంగా ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానం ఉన్న శాంపిల్స్ను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు లేదా.. జీనోమ్ పరీక్షలు నిర్వహించే అనుమతులు ఉన్న ల్యాబ్కు పంపాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ కనిపెట్టి వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు.
బ్రిటన్ మీదగా ప్రయాణించినా..