తెలంగాణ

telangana

By

Published : Feb 9, 2022, 8:22 PM IST

ETV Bharat / bharat

'ఆఫ్‌లైన్​లోనే సీబీఎస్‌ఈ రెండో టర్మ్​ పరీక్షలు'

CBSE Term 2 Board Exams: ఈసారి ఆఫ్‌లైన్ పద్ధతిలో సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలను నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. ఏప్రిల్ 26 నుంచి రెండో టర్మ్‌ బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

CBSE exams
సీబీఎస్‌ఈ పరీక్షలు

CBSE Term 2 Board Exams:సీబీఎస్​ఈ 10, 12 తరగతుల పరీక్షలను ఈసారి ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. రెండో టర్మ్‌ బోర్డు పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి ఆఫ్‌లైన్‌లో చేపట్టనున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది.

దేశంలో కరోనా పరిస్థితులపై వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సాన్యం భరద్వాజ్ తెలిపారు.

థియరీ పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభమవుతాయని.. పరీక్షల పూర్తి షెడ్యూల్ త్వరలోనే వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:కారు డిక్కీలోని బిడ్డను చూస్తూ 3కి.మీ ప్రయాణించిన గోవు

ABOUT THE AUTHOR

...view details