తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CBSE result 2021: పదో తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్​ఈ(CBSE result 2021) పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను వెల్లడించినట్లు సీబీఎస్​ఈ బోర్డు స్పష్టం చేసింది.

By

Published : Aug 3, 2021, 12:05 PM IST

Updated : Aug 3, 2021, 1:29 PM IST

CBSE, results
సీబీఎస్​ఈ, ఫలితాలు

సీబీఎస్​ఈ పదవ తరగతి ఫలితాల్లో 99.04శాతం ఉత్తీర్ణత నమోదైంది. సీబీఎస్​ఈ బోర్డు మంగళవారం ఫలితాలను విడుదల చేయగా, బాలుర కంటే బాలికల్లో 0.35శాతం ఎక్కువ ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం విద్యార్ధుల్లో 57,000 మంది 95 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారు. 2లక్షల మంది విద్యార్ధులు 90 నుంచి 95 శాతం మార్కులు సొంతం చేసుకున్నారు.

ఈ ఏడాది సీబీఎస్​ఈ మెరిట్‌ జాబితాను ప్రకటించలేదు. ఇంకా 16,000 మంది విద్యార్ధుల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. కరోనా రెండో దశ కారణంగా ఈ ఏడాది సీబీఎస్​ఈ పది, 12వ తరగతి పరీక్షలను రద్దు చేశారు. ప్రత్యామ్నాయ మదింపు విధానం ద్వారా మార్కులను లెక్కించారు. ఇందులో భాగంగా 20 మార్కులను అంతర్గత సమీక్ష ద్వారా, 80 మార్కులను విద్యార్ధి ఏడాదిలో నిర్వహించిన వివిధ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా కేటాయించారు.

సీబీఎస్​ఈ పదో తరగతి ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌తో పాటు స్కూల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:సీబీఎస్​ఈ క్లాస్​-12 ఫలితాలు విడుదల​.. బాలికలే టాప్

Last Updated : Aug 3, 2021, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details