తెలంగాణ

telangana

By

Published : Oct 26, 2021, 3:38 PM IST

ETV Bharat / bharat

సబ్​మెరైన్ల రహస్య డేటా లీక్.. ముగ్గురు నేవీ అధికారులు అరెస్ట్!

సబ్​మెరైన్​లకు సంబంధించిన సమాచారాన్ని లీక్ (Submarine Data Leaked) చేసినందుకు ఇద్దరు విశ్రాంత ఉద్యోగులు సహా ముగ్గురు అధికారులను సీబీఐ (CBI News) అరెస్టు చేసింది. ఇందులో ముంబయిలో పనిచేస్తున్న కమాండర్ స్థాయి అధికారి (Indian Navy news) ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అధికారి.. సమాచారన్ని రహస్యంగా విశ్రాంత ఉద్యోగులకు పంపించారని వెల్లడించాయి.

CBI arrests Navy officers in information leak case
సబ్​మెరైన్ రహస్య డేటా లీక్

జలాంతర్గాములకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేసినందుకు (Submarine Data Leaked) నావికా దళానికి చెందిన ప్రస్తుత అధికారి, ఇద్దరు మాజీ అధికారులను సీబీఐ (CBI News) అరెస్టు చేసింది. ప్రస్తుతం ముంబయిలో పనిచేస్తున్న కమాండర్ స్థాయి అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కిలో క్లాస్ సబ్​మెరైన్​ ఆధునికీకరణకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నేవీ కమాండర్.. విశ్రాంత ఉద్యోగులకు రహస్యంగా చేరవేశారని వెల్లడించాయి. అరెస్టైన వారితో సంబంధాలు ఉన్న నేవీ ఉద్యోగులను సీబీఐ ప్రశ్నిస్తోందని ఆయా వర్గాలు చెప్పాయి. విచారణకు నావికా దళం నుంచి పూర్తి సహకారం ఉందని తెలిపాయి.

మరోవైపు, నావికాదళం (Indian Navy news) సైతం ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. వైస్ అడ్మిరల్, రేర్ అడ్మిరల్ స్థాయి అధికారుల నేతృత్వంలో ఈ విచారణకు ఆదేశించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్​లో జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని వీరిని ఆదేశించినట్లు వెల్లడించాయి.

మరిన్ని అరెస్టులు?

త్రివిధ దళాలకు చెందిన అనేక మంది విశ్రాంత ఉద్యోగులపై దర్యాప్తు సంస్థలు నిఘా పెడుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే తాజా అరెస్టులు జరిగాయని వెల్లడించారు. వీరి నుంచి అందిన సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:విదేశాల చేతికి దేశ రక్షణ రహస్యాలు?

ABOUT THE AUTHOR

...view details