అసోం మాజీ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా కుమారుడు అశోక్ సైకియాను సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. 25 ఏళ్ల క్రితం నమోదైన రూ. 9 లక్షల రుణ ఎగవేత కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి.. అశోక్కు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడం వల్ల అతనిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
అశోక్ సైకియాను గువాహటిలోని సీబీఐ బృందం అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నట్లు స్పష్టం చేశారు. ఈ అరెస్ట్పై ఆయన సోదరుడు, ప్రస్తుతం అసోం శాసనసభలో ప్రతిపక్షనాయకుడుగా ఉన్న దేబాబ్రత సైకియా స్పందించారు. తన సోదరుడిని సీబీఐ అరెస్ట్ చేసిన మాట వాస్తవమేనని చెప్పారు.
"అశోక్ను అరెస్టు చేశారా లేక అదుపులోకి తీసుకున్నారా? అనే విషయం ఇంకా తెలియదు. ఎక్కడకి తీసుకెళ్లారు అనే సమాచారం కూడా మా దగ్గర లేదు. వారు చూపించింది చాలా పాత కేసు. దీనికి సంబంధించిన అన్నింటినీ పూర్తి చేశాం. బ్యాంక్ ఈ సమాచారాన్ని కోర్టుకు తెలియజేయక పోవడం వారి తప్పు."