తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మత్స్యకారుడి వలలో 36కిలోల కాట్లా చేప - కేఆర్​ఎస్​ డ్యాం

కర్ణాటక మండ్యాలోని ఓ జలాశయంలో భారీ చేప బయటపడింది. దీని బరువు 36 కేలోలకు పైగా ఉన్నట్లు స్థానిక మత్స్యకారుడు తెలిపాడు.

Catla fish, KRS Dam
కాట్లా చేప, కృష్ట రాజ సాగర్​ డ్యాం

By

Published : Jun 2, 2021, 4:03 PM IST

Updated : Jun 2, 2021, 4:19 PM IST

కర్ణాటక మండ్యాలోని కృష్ట రాజ సాగర్​ డ్యాం జలాల్లో 36 కిలోల కాట్ల చేప బయటపడింది. మత్స్యకారుడు నంజుడన్న వేసిన వలలో ఈ భారీ చేప పడింది. ఇంత పెద్ద చేప వలలో పడడం తన చిన్నతనం నుంచి ఇదే తొలిసారి అని మత్స్యకారుడు తెలిపాడు.

చేప పరిమాణం చూపిస్తున్న మత్స్యకారుడు
భారీ చేపతో నంజుడన్న

సాధారణంగా ఇలాంటి చేపలను పట్టడానికి తంగస్​ అనే పెద్ద వలలను ఉపయోగిస్తారని నంజుడన్న చెప్పారు. వాటి ధర సుమారు రూ. 50 వేల వరకూ ఉంటుందని పేర్కొన్నారు. డ్యాంలో ఇంతకు మించిన పెద్ద చేపలు కూడా ఉన్నాయని తెలిపిన ఆయన.. వాటి వేటకు తమ దగ్గర ఉండే రూ.20వేల వలలు సరిపోవన్నారు.

అయితే కరోనా కారణంగా ఈ భారీ చేపను మొత్తం ఒకే సారి అమ్మలేదని చెప్పారు నంజుడన్న. చివరకు దానిని కిలో రూ.170 చొప్పున రూ.6వేలకు అమ్మినట్లు వివరించారు.

ఇదీ చూడండి:భార్యను నరికి.. వీధిలోకి లాక్కెళ్లి హల్​చల్​!

Last Updated : Jun 2, 2021, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details