తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2021, 5:12 AM IST

ETV Bharat / bharat

'ముఖ్యమంత్రిని చంపాలి'.. పోస్టర్‌ కలకలం.!

పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​కు సంబంధించి ఆ రాష్ట్రంలో అంటించిన ఓ పోస్టర్​పై తీవ్ర కలకలం రేగింది. ముఖ్యమంత్రిని చంపితే.. రూ. 10లక్షల డాలర్లు ఇస్తారని దానిపై రాసి ఉంది.

Case lodged over 'death threat' to Punjab CM
ముఖ్యమంత్రిని చంపాలి.. పోస్టర్‌ కలకలం.!

పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ను చంపాలంటూ గుర్తు తెలియని వ్యక్తి మొహాలిలో ఓ పోస్టర్‌ను అంటించడం కలకలం రేగింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మొహలీలోని సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలో ఈ పోస్టర్‌ దర్శనమిచ్చినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. ముఖ్యమంత్రిని చంపితే రూ.10 లక్షల డాలర్లు ఇస్తారని ఆ పోస్టర్‌పై రాసి ఉంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన ఓ ఈమెయిల్‌ ఐడీని కూడా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోస్టర్‌ను ఎవరు అంటించారనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

ఇదీ చదవండి:ఇంటర్​లో ఫస్ట్​క్లాస్​ వచ్చిన బాలికలకు స్కూటీలు

ABOUT THE AUTHOR

...view details