తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేలిన కారు టైరు- డంపర్​ను ఢీకొట్టగానే మంటలు- 8 మంది సజీవదహనం - బరేలీ కారు ప్రమాదం

Car Hits Dumper in Uttar Pradesh After Tire Burst : డంపర్​ను కారు ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ఘటన సమయంలో డోర్ లాక్ అవ్వడం వల్ల కారులోని వారెవరూ బయటకు రాలేకపోయారు. మృతుల్లో ఓ చిన్నారి సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Car Hits Dumper in Uttar Pradesh After Tire Burst
Car Hits Dumper in Uttar Pradesh After Tire Burst

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 7:05 AM IST

Updated : Dec 10, 2023, 7:38 AM IST

Car Hits Dumper in Uttar Pradesh After Tire Burst :ఉత్తర్​ప్రదేశ్ బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డంపర్​ను ఓ కారు ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగి ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఓ చిన్నారి సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మంటల్లో కాలిపోతున్న వాహనాలు

బహేడీ ప్రాంతానికి చెందిన కొందరు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. బరేలీ- నైనీతాల్​ రహదారిపై వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్​ను దాటి మరో లేన్​లోకి వెళ్లింది. ఎదురుగా వస్తున్న డంపర్​ను వేగంగా ఢీకొనడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదేసమయంలో కారు డోర్ లాక్ అయిపోయింది. లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశమే లేకపోవడం వల్ల ప్రయాణికులంతా సజీవ దహనమయ్యారు.

మంటల్లో కాలిపోతున్న వాహనాలు
మంటల్లో కాలిపోయిన కారు

ఢీకొట్టిన తర్వాత ఈడ్చుకెళ్లి!!
కారులో ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఓ చిన్నారి సైతం సజీవ దహనమైనట్లు చెప్పారు. కారు, డంపర్ నుంచి భారీగా మంటలు చెలరేగుతుండటాన్ని గమనించిన స్థానికులు తమకు సమాచారమిచ్చారని పోలీసులు వివరించారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చినట్లు స్పష్టం చేశారు. 'ఢీకొట్టిన తర్వాత కారును డంపర్ కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా లాక్ అవ్వడం వల్ల ఎవరూ బయటకు రాలేకపోయారు' అని బరేలీ ఎస్ఎస్​పీ ఘులే సుశీల్ చంద్రబన్ తెలిపారు.

ఘటనాస్థలిలో పోలీసులు
ఘటనాస్థలిలో పోలీసు అధికారులు

పరారీలో డంపర్ డ్రైవర్
మృతుల్లో ముగ్గురి గుర్తింపును పోలీసులు నిర్ధరించారు. మృతదేహాలన్నింటినీ పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. 'ఉన్నతాధికారులు సైతం ఘటనాస్థలిని పరిశీలించారు. డంపర్ డ్రైవర్ పారిపోయాడు. మృతులను ఫర్కాన్, ఆరిఫ్, ఆసిఫ్​లుగా గుర్తించాం. వీరంతా బెహారీలోని జామ్​నగర్​కు చెందినవారు. ప్రమాదానికి గురైన కారును ఫర్కాన్ బుక్ చేసుకున్నాడు. బరేలీలోని ఫహామ్ లాన్​లో జరిగిన వివాహ కార్యక్రమానికి వీరంతా హాజరై తిరిగి వెళ్తున్నారు. మృతుల్లో ఒకరైన ఆరిఫ్ ఎనిమిది రోజుల క్రితమే వివాహం చేసుకున్నాడు' అని పోలీసులు వివరించారు.

Last Updated : Dec 10, 2023, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details