తెలంగాణ

telangana

'ఘనంగా గురు తేగ్​ బహదూర్​ జయంతి వేడుకలు'

గురు తేగ్​ బహదూర్​ ప్రభావం లేకుండా నాలుగు శతాబ్దాలలో భారత్​ చరిత్రను ఊహించలేమని ప్రధాని మోదీ అన్నారు. ఆయన నేర్పిన పాఠాలు, సిక్కు గురు సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

By

Published : Apr 8, 2021, 4:33 PM IST

Published : Apr 8, 2021, 4:33 PM IST

Can't imagine any period in last 4 centuries without Guru Tegh Bahadur's influence: PM Modi
'గురు తేగ్​ బహదూర్​ ప్రభావం లేని భారత్​ను ఊహించలేం'

తొమ్మిదవ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ ప్రస్తావన లేకుండా గత నాలుగు శతాబ్దాలలో భారతదేశ చరిత్రను ఊహించలేమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తేగ్ బహదూర్ (ప్రకాశ్ పూరబ్) 400వ జయంతిని పురస్కరించుకుని గురువారం వర్చువల్​గా జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 400వ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

"గత నాలుగు శతాబ్దాలలో, గురు తేగ్ బహదూర్​ ప్రభావం లేని భారత్​ను ఊహించలేం. మనందరికీ ఆయన స్ఫూర్తిప్రదాత. గురు నానక్ నుంచి గురు తేగ్ బహదూర్, గురు గోవింద్ సింగ్​ వరకు, సిక్కు గురు సంప్రదాయం ఆదర్శ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

గురు తేగ్‌బాహదూర్​ బోధనలతో పాటు మొత్తం గురు సంప్రదాయాన్ని ప్రపంచానికి భారతీయులు పరిచయం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.

సమావేశంలో మోదీ

మోదీతో పాటు ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్​షా, మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్, లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పాల్గొన్నారు.

మోదీకి పంజాబ్​ సీఎం వినతి..

తేగ్​ బహదూర్​కు ఘనమైన నివాళి ఇచ్చేలా రూ.937 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆరంభించడానికి పంజాబ్​ ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించాలని మోదీని అమరీందర్ సింగ్ కోరారు. ఈ ప్రతిపాదనలో శ్రీ ఆనంద్​పుర్​ సాహిబ్​ను స్మార్ట్​ సిటీగా అభివృద్ధి చేయాలని కూడా ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా ఉద్ధృతిపై నేడు ముఖ్యమంత్రులతో మోదీ భేటీ

ABOUT THE AUTHOR

...view details