తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీర్భుమ్ హింసపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం - బీర్భుమ్ కేసు

బంగాల్​లో బీర్భుమ్​ సజీవ దహనాల కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని కోల్​కతా హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 7లోగా సీబీఐ నివేదిక సమర్పించాలని జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్ భరద్వాజతో కూడిన ధర్మాసనం తెలిపింది.

hc
కోల్​కతా హైకోర్టు

By

Published : Mar 25, 2022, 12:23 PM IST

పశ్చిమ బంగాల్‌లోని బీర్భుమ్​ హింసపై సీబీఐ విచారణ జరపాలని కోల్​కతా హైకోర్టు ఆదేశించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ తన నివేదికను ఏప్రిల్ 7లోపు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన పేపర్లను, నిందితులను అప్పగించాలని బంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్​కు ఆదేశాలు జారీ చేసింది. బీర్భుమ్ కేసును సుమోటోగా స్వీకరించిన కోర్టు ఈ మేరకు విచారణ జరిపింది. ఏప్రిల్ 7న తదుపరి విచారణ జరపనుంది.

ఇదీ జరిగింది

బంగాల్​, రాంపుర్​హట్​ ప్రాంతంలో కొందరు దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టగా ఇద్దరు చిన్నారులు సహా 8 మంది సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. "తృణమూల్​ కాంగ్రెస్​ నేత, బర్షాల్​ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్​ బహదూర్​ షేక్​ను ఎవరో హత్యచేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు.. రాంపుర్​హట్​లోని 5 ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు" అని పోలీసులు తెలిపారు. . హత్యకు ముందు బాధితులను తీవ్రంగా కొట్టి అనంతరం సజీవ దహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్టు చేయగా.. నిర్లక్ష్యం వ్యవహరించిన పలువురు పోలీసులను సస్పెండ్‌ చేశారు.

ఇదీ చదవండి:ఫోన్ పగులకొట్టాడని.. కూలీని హత్య చేసిన యువకుడు..

ABOUT THE AUTHOR

...view details