తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిటిషన్​ దాఖలు చేసిన 23ఏళ్లకు ధర్మాసనం వద్దకు..

రిజిస్ట్రీ పనితీరుపై కోల్​కతా హైకోర్టు తీవ్ర ​అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ మహిళ దాఖలు చేసిన హెబియస్​ కార్పస్ పిటిషన్​ను 23 ఏళ్లకు ధర్మాసనం వద్దకు విచారణకు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ కేసును దర్యాప్తు చేయాలని బంగాల్​ డీజీపీని ఆదేశించింది.

Cal HC expresses displeasure against registry for not listing petition for 23 years
పిటిషన్​ దాఖలు చేసిన 23ఏళ్లకు ధర్మాసనం వద్దకు

By

Published : Dec 5, 2020, 10:38 AM IST

తమ రిజిస్ట్రీ విభాగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కోల్​కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్​ రాధాకృష్ణణ్. ఓ కేసుకు సంబంధించి హెబియస్​ కార్పస్ పటిషన్​ను 23ఏళ్ల క్రితం ఓ మహిళ దాఖలు చేసినా పట్టించుకోకపోవటంపై అభ్యంతరం తెలిపారు. ఓ తల్లి ఆసుపత్రిలో పుట్టిన తన బిడ్డను తనకు ఇవ్వాలని కోరుతూ కోల్​కతా హైకోర్టులో 1997, డిసెంబర్​ 22న పిటిషన్​ దాఖలు చేశారు.

" సాధారణంగా ఏ పిటిషన్​ దాఖలు చేసినా 3మూడు నెలల్లో మా దృష్టికి రావాలి. కానీ ఈ కేసు 23ఏళ్ల తరువాత వచ్చింది. ఈ పిటిషన్​ను ముగించటం తప్ప పరిష్కారం లేదు. రిజిస్ట్రీ విభాగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. సమయానికి పిటిషన్లను లిస్ట్​లో చేర్చకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం."

-కోల్​కతా హైకోర్టు.

ఈ కేసుపై దర్యాప్తు చేయాలని జస్టిస్​ టీబీఎన్​ రాధాకృష్ణణ్​, జస్టిస్​ అరిజిత్​ బెనర్జీలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details