C 295 Transport Aircraft India :భారత వాయుసేనలో అత్యాధునిక రవాణా విమానం చేరింది. ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ తొలి C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ను బుధవారం భారత్కు అందజేసింది. దక్షిణ స్పానిష్ నగరం సెవిల్లేలోని ఎయిర్బస్ ప్రొడక్షన్ ఫెసిలిటీ నుంచి వైమానిక దళపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీర్ఆర్ చౌదరి ఈ విమానాన్ని అందుకున్నారు. అనంతరం అదే విమానంలో భారత్కు పయనమయ్యారు. ఈ విమానం ఈజిప్టులోని మట్లా, బెహ్రెయిన్లో ఆగి.. వడోదర ఎయిర్బేస్కు చేరుకోనుంది. మొత్తం విమానాలు డెలివరీ అయితే.. ప్రపంచంలోనే భారత వైమానిక దళం అతిపెద్ద C-295 అపరేటర్ అవుతుందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ చివరి వారంలో ఈ విమానం అధికారికంగా వాయుసేనలోకి చేరే అవకాశం ఉంది.
మొదటి సీ-295 విమానం డెలివరీ అందుకున్న తర్వాత ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడారు. ఇది యావత్ దేశానికి ఒక మైలురాయి అని.. ఆత్మనిర్భర్ భారత్కు నిదర్శన అని అన్నారు. 'వాయుసేన వ్యూహాత్మక ఎయిర్లిఫ్ట్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. దేశంలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈ డీల్లో భాగంగా 17వ విమానాన్ని భారత్లో తయారవుతుంది. ఇది దేశంలో తయారైన మొదటి మిలిటరీ రవాణా విమానం అవుతుంది. ఇది భారతీయ ఎవియేషన్ పరిశ్రమకు ఒక పెద్ద ముందడుగు' అని వివరించారు.
వైమానికి దళాన్ని ఆధునీకరించడమే లక్ష్యంగా రెండేళ్ల క్రితం ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్బస్ మధ్య రూ.21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఎయిర్బస్ 2025 చివరి నాటికి 'ఫ్లై-అవే' స్థితిలో మొదటి 16 విమానాలను అప్పగించాల్సి ఉంటుంది. మరో 40 విమానాలను భారత్లో.. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేసి.. అసెంబుల్ చేస్తుంది. వాయుసేనకు చెందిన అవ్రో విమానాల స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు.