తెలంగాణ

telangana

ETV Bharat / bharat

100 మంది వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా - ఉత్తర్​ప్రదేశ్​లో బస్​ ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​లోని కన్నౌజ్​ వద్ద టైరు పేలి ఓ బస్సు​ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో వంద మంది వలస కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది.

labourers bus overturned
వలసదారుల బస్​ బోల్తా-15 మందికి తీవ్రగాయాలు

By

Published : Apr 26, 2021, 4:34 PM IST

వంద మంది వలస కూలీలతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర్​ప్రదేశ్​ కన్నౌజ్​లోని ఖదీచా గ్రామానికి సమీపంలో ఉన్న ఆగ్రా-లఖ్​నవూ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

బోల్తా పడిన బస్సు​
ఘటనాస్థలిలో ఉన్న బాధితులు
క్షతగాత్రులను అసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది

గాయపడిన వారిని బిల్​హౌరీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. రాజస్థాన్ నుంచి బిహార్ వెళ్తున్న ఈ బస్సు టైర్ పేలడం వల్లే.. అదుపు తప్పి బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇదీ చూడండి:పార్కింగ్ స్థలంలోనే కరోనా మృతదేహాల దహనం

ABOUT THE AUTHOR

...view details