తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చివరి నిమిషంలో రూటు మార్పే ముప్పైందా! - మధ్య ప్రదేశ్​ బస్సు ప్రమాదం అసలు కారణం

మధ్యప్రదేశ్​ బస్సు ప్రమాదంపై ఎన్నెన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం సహా.. ట్రాఫిక్​ కారణంగా వెరే మార్గంలో బస్సును నడపడం వల్లే ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది.

MP bus tragedy
మధ్య ప్రదేశ్ బస్సు ప్రమాదం

By

Published : Feb 17, 2021, 6:26 AM IST

మధ్యప్రదేశ్​లో మంగళవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో కీలక విషయం బయటకు వచ్చింది. ట్రాఫిక్​ను తప్పించుకునేందుకు డ్రైవర్​ బస్సును చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ మార్గంలో తీసుకెళ్లినట్లు తెలిసింది. 80కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత రాపుర్​ సెకిన్ తాలుకా.. పట్నా వద్ద బస్సుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోయాడు. దీనితో బస్సు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.

ఈ ఘోర ప్రమాదంలో బస్సులో ఉన్న వారిలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు రాగా.. ఓ కుటుంబం సహాయంతో బయట పడ్డారు. అయితే అందులో ఒకరు ఆస్పత్రితో చికిత్ర పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details