ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో జల ప్రళయం సంభవించి ధౌలీగంగాపై ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైనీ గ్రామంలో 200 అడుగుల పొడవుగల బెయిలీ రహదారి వంతెనను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి, ప్రారంభించింది సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బీఆర్ఓ).
ఉత్తరాఖండ్: ధౌలీగంగాపై కొత్త వంతెన ప్రారంభం - ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ జల ప్రళయంలో ధౌలీగంగాపై కొట్టుకుపోయిన వంతెన స్థానంలో 200 అడుగుల పొడవైన బెయిలీ వంతెనను సరిహద్దు రహదారుల సంస్థ ప్రారంభించింది. కేవలం 8 రోజుల్లోనే వంతెనను నిర్మించడం గమనార్హం.

కొత్త బెయిలీ వంతెనను ప్రారంభించిన బీఆర్ఓ
ఫిబ్రవరి 7న ధౌలీగంగా, రిషిగంగా నదుల్లో వచ్చిన వరదలకు అంతకుముందున్న 90 అడుగుల పొడవున్న వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దాంతో 8 రోజుల్లోనే 200 అడుగుల పొడవు గల వంతెన నిర్మించింది బీఆర్ఓ.