మధ్యప్రదేశ్లో భోపాల్-నాగ్పుర్ జాతీయ రహదారిలో సుఖ్త్వా నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. 40 అడుగుల ఎత్తైన ఈ వంతెనను 157 ఏళ్ల క్రితం బ్రిటీష్ కాలంలో నిర్మించారు. 138 చక్రాలు గల భారీ వాహనం వంతెనపై నుంచి వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు గాయపడ్డారు. భారీ యంత్రాన్ని తీసుకెళుతున్న వాహనం నదిలో పడిపోయింది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
157 ఏళ్ల నాటి వంతెనపై 138 చక్రాల లారీ.. ఒక్కసారిగా కూలి... - Mp latest news in hindi
మధ్యప్రదేశ్లో బ్రిటీష్ కాలం నాటి వంతెన కూలిపోయింది. భోపాల్-నాగ్పుర్ జాతీయ రహదారిలో సుఖ్త్వా నదిపై గల 40 అడుగుల ఎత్తైన వంతెన.. 138 చక్రాల భారీ వాహనం ప్రయాణించడం వల్ల కుప్పకూలింది.
![157 ఏళ్ల నాటి వంతెనపై 138 చక్రాల లారీ.. ఒక్కసారిగా కూలి... 138 చక్రాల వాహనం.. చేసింది బ్రిటీష్ బ్రిడ్జి నాశనం..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14982463-501-14982463-1649596148061.jpg)
Bhopal Nagpur Highway bridge collapses
ప్రమాదంలో కూలిపోయిన వంతెన
బ్రిటీష్ కాలం నాటి వంతెన కూలిపోవడం వల్ల ప్రస్తుతం హార్దా వైపునకు ట్రాఫిక్ మళ్లించామని అధికారులు తెలిపారు. ఈ వంతెనపై నుంచి రోజు సుమారు 5 వేల వాహనాలు ప్రయాణించేవని చెప్పారు. తోషిబా కంపెనీకి చెందిన ఈ వాహనం హైదరాబాద్ నుంచి ఇటార్సీకి వెళుతోంది.
ఇదీ చదవండి:తుక్కు నుంచి రాజ్దూత్ బైక్ తయారీ.. కొడుకు కోసం స్పెషల్గా..
Last Updated : Apr 10, 2022, 7:57 PM IST