తెలంగాణ

telangana

By

Published : Apr 22, 2021, 6:00 PM IST

ETV Bharat / bharat

బంగాల్​లో బాంబు పేలుడు- ఆరుగురికి గాయాలు

బంగాల్​లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలో కొంతమంది దుండగులు నాటు బాంబులను విసిరారు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

crude bombs
బంగాల్​లో బాంబు పేలుడు

బంగాల్​లో ఆరో దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్న వేళ.. నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాలు జిల్లా తితాగఢ్​ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పేలుడు జరిగింది.

పేలుడు జరిగిన వెంటనే.. ఘటనాస్థలికి పోలీసు సిబ్బంది, సీఏపీఎఫ్​ జవాన్లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో.. మాస్కు ధరించిన, గుర్తు తెలియని వ్యక్తులు.. తితాగఢ్​లోని టాటా గేట్​ వద్ద నాటు బాంబులను విసిరినట్లు తేలిందని వెల్లడించారు.

క్షతగాత్రులను బీఎన్​ బోస్​ ఆస్పత్రికి తరలించామని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'నిధులున్నా టీకా ఉచితంగా ఇవ్వరేం?'

ఇదీ చూడండి:ఉగ్ర కుట్ర భగ్నం- పారిపోయిన ముష్కరులు

ABOUT THE AUTHOR

...view details