తెలంగాణ

telangana

By

Published : Aug 25, 2021, 10:08 AM IST

Updated : Aug 25, 2021, 10:28 AM IST

ETV Bharat / bharat

సుప్రీం మాజీ జడ్జి ఇంటి వద్ద బాంబుపేలుళ్ల కలకలం

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇంటి వద్ద బాంబు పేలుడు సంచలనంగా మారింది. బైక్​పై వచ్చిన కొందరు దుండగులు జస్టిస్ అశోక్ భూషణ్ ఇంటి వద్ద రెండు బాంబులను విసిరి వెళ్లారు.

bombing
బాంబుపేలుడు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్.. పాత ఇంటి వద్ద బాంబు పేలుళ్ల ఘటన తీవ్ర కలకలం రేపింది. బైక్​పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. రెండు బాంబులను విసిరి పరారయ్యారు.

ఉత్తర్​ప్రదేశ్, ప్రయాగ్​రాజ్​, హషిమ్​పుర్​లోని కొలోనిల్​గంజ్​లో జస్టిస్ అశోక్​ భూషణ్ నివాసం ఉంది. అయితే ప్రస్తుతం ఆ ఇంట్లో అశోక్​ భూషణ్ సోదరుడు అనిల్ భూషణ్ ఉంటున్నారు. ఆయన ప్రస్తుతం అలహాబాద్​ హైకోర్టులో అడ్వకేట్​గా పనిచేస్తున్నారు. బాంబు దాడి జరిగిన వెంటనే హుటాహుటిన పోలీసు బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. డీఐజీ త్రిపాఠీ.. అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఈ ఘటనపై కొలోనిగంజ్​ పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు.

కారణం అదేనా..

జస్టిస్ అశోక్​ భూషణ్ పాత ఇంటి పక్కనే నివాసం ఉంటున్న రెండు వర్గాల మధ్య చాలాకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరొక వర్గాన్ని భయపెట్టేందుకు ఇంకో వర్గం వారు బాంబు దాడి చేసి ఉంటారని.. ఐజీ రేంజ్ అధికారి కేపీ సింగ్ తెలిపారు. సీసీటీవీలో నిందితులను గుర్తించామని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.

ఇదీ చదవండి:పాఠశాలలోనే బాలుడి దారుణ హత్య

Last Updated : Aug 25, 2021, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details