తెలంగాణ

telangana

ఆ అజెండాతోనే భారత్​కు అమెరికా విదేశాంగ మంత్రి!

By

Published : Jul 25, 2021, 4:46 PM IST

Updated : Jul 25, 2021, 5:22 PM IST

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​ రెండు రోజులపాటు భారత్​లో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనిలో భాగంగా ఇండో-పసిఫిక్, భద్రత​, ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశముందని పేర్కొన్నాయి. బ్లింకెన్​.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్​లో పర్యటించడం ఇదే తొలిసారి.

US Secretary of State, Antony Blinken
అమెరికా విదేశాంగ మంత్రి, ఆంటోని బ్లింకెన్

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. భారత్​లో పర్యటించనున్నారు. ఈ నెల 27 నుంచి రెండు రోజుల పాటు భారత్​ను సందర్శించనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. దీనిలో భాగంగా అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణతో చోటుచేసుకున్న పరిణామాలు, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేయకుండా, వారికి స్థావరం కల్పించకుండా పాకిస్థాన్​పై ఒత్తిడి పెంచడం, ఇండో-పసిఫిక్​ సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశముందని పేర్కొన్నాయి.

విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా భారత్​లో పర్యటించనున్న బ్లింకెన్​.. పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల పౌరుల ప్రయోజనం కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు జరగనున్నాయి.

ఇండో పసిఫిక్​ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ మందగమనం, కరోనా నియంత్రణకు సాయం, భద్రత అంశాలపై ఇరుపక్షాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయని అధికార వర్గాలు తెలిపాయి. దీంతోపాటు ఈ ఏడాది చివరిలో జరగబోయే క్యాడ్​ దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఆ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరపనున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అంశాలపైనా మాట్లాడనున్నారు.

ఇదీ చూడండి:'నేషన్​ ఫస్ట్​.. ఆల్వేస్​ ఫస్ట్' మంత్రంతో ముందుకు'

Last Updated : Jul 25, 2021, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details