తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంధుడి సాహసం.. 7,500 కిలోమీటర్ల సైకిల్​ యాత్ర!

'ఐ యామ్​ బ్లైండ్​.. బట్​ వెల్​ ట్రైన్డ్​'.. ఇది ఓ సినిమాలో హిరో రవితేజ చెప్పే డైలాగ్​. ఈ మాటలను నిజ జీవితంలో చేసి చూపిస్తున్నాడు ఓ ముంబయి వాసి. పుట్టుకతోనే అంధుడైన అజయ్​.. 7500 కిలోమీటర్ల సైకిల్​ యాత్ర చేపట్టాడు. ముంబయి నుంచి శ్రీనగర్​, అక్కడి నుంచి కన్యాకుమారికి సైకిల్​ మీద వెళ్లనున్నాడు. కన్యాకుమారి నుంచి ముంబయికి చేరిన తర్వాత అతడి సాహస యాత్ర ముగుస్తుంది. లక్ష్యాన్ని ఛేదించేందుకు ఎన్ని అడ్డంకులెదురైనా ఆత్మస్థైర్యం ముందు తలవంచాల్సిందేనని నిరూపిస్తున్న అజయ్​.. ఎందరికో స్ఫూర్తిదాయకం.

By

Published : Nov 17, 2021, 1:14 PM IST

Updated : Nov 17, 2021, 5:37 PM IST

cycling news in mumbai
అంధుడు సాహసం.. 7,500 కి.మీలు సైకిల్​ యాత్ర..

అంధుడి సాహసం.. 7,500 కిలోమీటర్ల సైకిల్​ యాత్ర!

మన రోజువారీ జీవితాల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటిని చూసి కొందరు నిరుత్సాహపడతారు. మరికొందరు.. అనుకున్న పనిని మధ్యలోనే ఆపేసి, కారణాలను వెతుక్కుంటారు. కానీ ఆత్మస్థైర్యం ఉంటే చాలు.. ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని నిరూపిస్తున్నాడు ముంబయికి చెందిన ఓ అంధుడు. వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా సాహస యాత్ర చేపట్టాడు 25ఏళ్ల అజయ్​ లల్వాణీ. మనలోని నెగిటివ్ అంశాన్ని కూడా పాజిటివ్​గా మలుచుకోవచ్చని చాటిచెబుతూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

అజయ్​ లల్వాణీ
అజయ్​ లల్వాణీ

అజయ్​ సైకిల్​ యాత్రకు పెద్ద ప్రణాళికే ఉంది. ముంబయిలో మొదలైన అజయ్ యాత్ర​.. శ్రీనగర్​ను చుట్టి.. కన్యాకుమారికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ముంబయికి తిరుగుపయనమవుతాడు అజయ్. మొత్తం మీద ఈ 7,500కిలోమీటర్ల యాత్ర 45 రోజులు సాగనుంది.

సైకిల్​ యాత్రకు సై..
అజయ్​ బృందం

అంధుడైన అజయ్​కు సాయం చేసేందుకు 18సభ్యుల బృందం అతడితో వెళ్లింది. అజయ్​ ప్రయాణించే సమయంలో అతడి ముందు ఓ వాహనం, వెనక ఓ వాహనం ఉంటుంది. బృంద సభ్యులు వాకీటాకీతో అజయ్​కు మార్గనిర్దేశం చేస్తారు.

ముంబయి టు కశ్మీర్​ సైకిల్​ యాత్ర

అజయ్​ సైకిల్​ యాత్ర.. మంగళవారం గుజరాత్​లోని నవసారికి చేరింది. అయితే తన సాహసం వెనక ఓ బలమైన కారణం ఉందంటున్నాడు అతడు​.
"నేను 100శాతం అంధుడిని. నేను ఈ సాహసం చేయడం వెనక ఓ బలమైన కారణం ఉంది. అంధుల గురించి సమాజంలో ఎవరికీ సరైన అవగాహన లేదు. కానీ మా గురించి అందరూ తెలుసుకోవాలి. అదే సమయంలో రోడ్డు భద్రత కూడా ఎంతో ముఖ్యం. నేను ఈరోజు రోడ్డు మీద సైకిల్​పై వెళుతుంటే, చాలా ప్రాంతాల్లో లైట్లు కూడా లేవు. నాకు చూపు లేకపోయినా, చాలా మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. స్ట్రిట్​ లైట్లు లేకపోవడం ఇందుకు ఓ కారణం. మరోవైపు దేశవ్యాప్తంగా అనేక రోడ్లు ఇప్పటికీ దారుణంగా ఉన్నాయి. నేను 7,500 కిలోమీటర్లు సైకిల్​ యాత్ర చేపట్టాను. కానీ ముంబయి నుంచి యాత్ర మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అనేక ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయి."
-- అజయ్​ లల్వాణీ, సైక్లిస్ట్​.

అజయ్​కు సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. సైక్లింగ్​తో పాటు అతడు​ ఓ మంచి స్పోర్ట్స్​మెన్​​. రాక్​ క్లైంబింగ్​, స్విమ్మింగ్​లో దిట్ట. అజయ్​ ఓ పర్వతారోహకుడు కూడా. 17వేలు, 20వేల అడుగుల ఎత్తున్న హిమాలయ పర్వతాలను ఇప్పటికే అధిరోహించేశాడు. తన నెక్ట్స్​ టార్గెట్​ మౌంట్​ ఎవరెస్ట్​ అని, రెండేళ్లల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడు అజయ్​.

ఇవీ చూడండి:-

Last Updated : Nov 17, 2021, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details