తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో బ్లాక్​ ఫంగస్​ పంజా.. 52 మంది మృతి! - మ్యూకోర్మైకొసిస్

కరోనాను జయించినవారిని బ్లాక్​ ఫంగస్ వేధిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే ఈ వ్యాధి వల్ల 52 మంది మృతి చెందారని ఓ సీనియర్ వైద్యాధికారి తెలిపారు.

Mucormycosis
బ్లాక్ ఫంగస్, మ్యూకోర్మైకొసిస్

By

Published : May 14, 2021, 12:05 PM IST

మహారాష్ట్రలో బ్లాక్​ ఫంగస్​ పంజా విసురుతోంది. కొవిడ్​ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నప్పటికీ.. ఫంగస్​ కారణంగా 52 మందికి పైగా మరణించినట్లు సీనియర్ వైద్యాధికారి తెలిపారు. ఈ శిలీంద్ర వ్యాధి కారణంగా చాలా మంది కంటి చూపును కోల్పోతున్నట్లు వెల్లడించారు.

"మ్యూకోర్​మైకోసిస్(బ్లాక్ ఫంగస్) వల్ల మహారాష్ట్రలో 52 మంది మృతిచెందారు. వీరందరూ కొవిడ్​ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నవారే. బ్లాక్​ ఫంగర్​ వల్ల చనిపోయినవారి సంఖ్యను ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది."

--సీనియర్ వైద్యాధికారి.

మహారాష్ట్రలో 1500కు పైగా బ్లాక్​ ఫంగస్​ కేసులున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యాధికారి వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

కొవిడ్ బాధితుల్లో.. డయాబెటిస్, ఘగర్ వంటి వ్యాధులు వారిలోనే ఈ బ్లాక్ ఫంగస్​ ముప్పు ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 18 వైద్య కళాశాల ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి:

కరోనా బాధితులకు బ్లాక్ ఫంగస్​తో అంధత్వం!

బ్లాక్​ ఫంగస్​పై జాగ్రత్త సుమా!

ABOUT THE AUTHOR

...view details