కర్ణాటకలో వారం వ్యవధిలోనే 700 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి గల కారణాలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్.. నిపుణుల కమిటీతో ఆదివారం సమావేశం నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి గల కారణాలపై చర్చించారు. రాష్ట్రంలో గత వారం 700 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి చెందిన ఇతర దేశాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు లేవని.. కేవలం భారత్లోనే నమోదయ్యాయన్నారు.