ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను ఖరారు చేసేందుకు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి 27న అసోం, బంగాల్లో తొలి విడత పొలింగ్ జరగనున్న స్థానాలకు అభ్యర్థులను నేడు ఖరారు చేసే అవకాశముంది.
అసోం సీఎం సరబానంద సోనోవాల్తో పాటు బంగాల్కు చెందిన ముఖ్య నేతలు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే అభ్యర్థుల మొదటి జాబితా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భాజపా వర్గాలు పేర్కొన్నాయి.