తమిళనాడు భాజపా ట్విట్టర్లో ఫోస్ట్ చేసిన వీడియో వివాదాస్పదమైంది. ఎన్నికల ప్రచార వీడియోలో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం కోడలు శ్రీనిధి కార్తీ చిదంబరం భరతనాట్యం చేస్తున్న వీడియోను ఉపయోగించింది కమలదళం. తమరై మలరటుమ్, తమిళనాడు వలరటుమ్(కమలం వికసిస్తుంది, తమిళనాడు అభివృద్ధి చెందుతుంది) అంటూ ట్వీట్ చేసింది. అయితే తర్వాత ఈ పోస్టును తొలగించింది.
'కమలం వికసించదు'
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారగా.. వెంటనే ఆ పోస్టును భాజపా తొలగించింది. దీనిపై స్పందించిన శ్రీనిధి.. "నా ఫొటోను భాజపా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం అసంబద్ధం. తమిళనాడులో 'తమరై ఎండ్రం మలరతు' (కమలం ఎప్పుడూ వికసించదు)" అని ట్వీట్ చేశారు.
పదేళ్ల క్రితం వీడియో..